శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 24 అక్టోబరు 2016 (15:16 IST)

మణిపూర్ ముఖ్యమంత్రిపై తుపాకీ కాల్పులు.. తృటిలో త‌ప్పించుకున్న ఇబోబీసింగ్‌

మణిపూర్ ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని ఎన్ఎస్‌సీఎల్ తీవ్రవాదులు తుపాకీ కాల్పులతో పాటు.. వరుస బాంబు పేలుళ్లకు తెగబడ్డారు. ఈ కాల్పులు, బాంబు పేలుళ్ళ నుంచి సీఎం ఇబోబీ సింగ్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్ప

మణిపూర్ ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని ఎన్ఎస్‌సీఎల్ తీవ్రవాదులు తుపాకీ కాల్పులతో పాటు.. వరుస బాంబు పేలుళ్లకు తెగబడ్డారు. ఈ కాల్పులు, బాంబు పేలుళ్ళ నుంచి సీఎం ఇబోబీ సింగ్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. 
 
ఆ రాష్ట్ర రాజ‌ధాని ఇంఫాల్‌కు 84 కిలోమీట‌ర్ల దూరంలోని ఉక్రుల్ ద‌గ్గ‌ర ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో నిర్మించిన ఆసుప‌త్రితో పాటు ప‌లు భ‌వ‌నాల ప్రారంభోత్స‌వానికి ఆయ‌న వెళుతుండ‌గా ఈ ఘ‌ట‌న జరిగింది. ఈ ఘ‌ట‌న‌తో ఉక్రుల్ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 
 
కాల్పులు జరిగిన సమయంలో ఇబోబీసింగ్‌ వెంట ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గైకాంగామ్ కూడా ఉన్నారు. ఈ ఘటనలో ఇద్దరు మణిపూర్ రైఫిల్స్ జవాన్లకు గాయాలయ్యాయి. ఒక్కసారిగా కాల్పుల ఘటన చోటుచేసుకోవడంతో వెంటనే ముఖ్యమంత్రిని ఆ ప్రాంతం నుంచి ఇంఫాల్ కు తరలించారు.