శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 12 ఏప్రియల్ 2016 (13:15 IST)

మధ్యప్రదేశ్ : నీటి కోసం వచ్చిన బాలికను బాణాలతో కొట్టి చంపేశారు!

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ బాలికను దారుణంగా హత్య చేశారు. నీటి కోసం వచ్చినందుకు ఈ దారుణానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే మధ్యప్రదేశ్‌లోని అలిరాజ్‌పూర్‌ జిల్లా, ఛోటా భవాటా గ్రామంలో సుర్మదా అనే 13 యేళ్ళ బాలిక తన సోదరుడితో కలిసి నీళ్లు పట్టుకునేందుకు ఓ చేతి పంపు వద్దకు వచ్చింది. అయితే ఆ చేతి పంపు యజమానులమంటూ ఇంద్రసింగ్ భిలాలా‌, అతడి కొడుకు మెస్టా గొడవ చేశారు. 
 
ఈ గొడవ మరింత పెరగడంతో తండ్రీ కొడుకులు కలిసి బాణాలు సంధించగా.. బాలిక ఎడమ కంట్లో నుంచి బాణం చొచ్చుకుపోయి ఆమె అక్కడికక్కడే మరణించింది. నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.