శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (11:28 IST)

చిన్నమ్మ జైలుకు.. ఎమ్మెల్యేలు ఇంటికి.. ఐదుగురు గోడదూకి జంప్.. ఎక్కడికెళ్లారు?

గోల్డెన్ బే రిసార్ట్స్‌లో మంగళవారం అర్థరాత్రి వరకూ నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. శశివర్గంలోని చాలామంది ఎమ్మెల్యేలు బస్సుల్లో, తమ వాహనాల్లో గోల్డెన్ బే రిసార్టును వీడి వెళ్లారు. దీంతో దాదాపు సగం మ

గోల్డెన్ బే రిసార్ట్స్‌లో మంగళవారం అర్థరాత్రి వరకూ నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. శశివర్గంలోని చాలామంది ఎమ్మెల్యేలు బస్సుల్లో, తమ వాహనాల్లో గోల్డెన్ బే రిసార్టును వీడి వెళ్లారు. దీంతో దాదాపు సగం మంది ఎమ్మెల్యేలకు పైగానే రాత్రి రిసార్ట్‌ను వదిలి ఇళ్లకు చేరుకున్నారు. కానీ మిగిలిన ఎమ్మెల్యేలు ఇంకా రిసార్ట్‌లోనే ఉన్నారు. వారిలో ఐదుగురు ఎమ్మెల్యేలు జంప్‌ ఇవాళ ఉదయం జంప్ అయినట్లు తెలుస్తోంది. 
 
శశికళ వర్గంలోని ఈ ఐదుగురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు గోడ దూకి పారియారు. పన్నీర్ వర్గంలో చేరేందుకే వారు ఈ చర్యకు పూనుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఆ ఐదుగురు ఎవరనేదానికి ఇంకా క్లారిటీ రాలేదు. గోడదూకి పారిపోయిన వారు పన్నీర్ సెల్వంకు మద్దతిస్తారో లేదో వేచి చూడాలి. 
 
ఇక చిన్నమ్మ జైలుకు వెళ్తున్నా.. అన్నాడీఎంకే పార్టీని తన హస్తంలోనే ఉండాలని ఎత్తుగడ వేస్తోంది. ఇప్పటికే పన్నీర్‌కు చెక్ పెట్టేందుకు పళని సామిని రంగంలోకి దించింది. అప్పుడే జైలులో ఉంటూ పాలన చేసేందుకు సులువవుతుందని శశికళ భావిస్తోంది. 
 
శశికళ వ్యవహారం చూస్తున్న తమిళ ప్రజలు చాలా ముదురని విమర్శిస్తున్నారు. అమ్మ వెంట వుండీ ఇలాంటి ఎత్తుగడలతోనే శశికళ జయను కీలుబొమ్మను చేసివుంటుందని వారు మాట్లాడుకుంటున్నారు. కానీ శశికళకు చెక్ పెట్టి అన్నాడీఎంకేలో గూండాలను ఇంటికి పంపించాలనుకున్న పన్నీరు బలపరీక్షలో నెగ్గుతారా? ఎమ్మెల్యేలు పళనికి సపోర్ట్ చేసి.. చిన్నమ్మను నెత్తిన పెట్టుకుంటారా? లేకుంటే వీరవిధేయుడైన పన్నీరుకు హ్యాండిస్తారా అనేది తెలియాల్సి వుంది.