శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 19 జనవరి 2017 (18:27 IST)

టీ తాగాలని క్యాంటీన్‌కు వచ్చింది.. కిటికీలు తెరుచుకుని దూకేసింది.. బెంగళూరులో?

ఎంఎన్‌సీ కంపెనీలో పనిచేస్తున్న 30 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడింది. తాను పనిచేస్తున్న ఆఫీస్‌లోని నాలుగో అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన బెంగళూరులో కలకలం సృష్టించింది. ఎంఎన్‌సీ కంపెనీలో పన

ఎంఎన్‌సీ కంపెనీలో పనిచేస్తున్న 30 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడింది. తాను పనిచేస్తున్న ఆఫీస్‌లోని నాలుగో అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన బెంగళూరులో కలకలం సృష్టించింది. ఎంఎన్‌సీ కంపెనీలో పనిచేస్తున్న 30 ఏళ్ళ శోభా లక్ష్మీనారాయణ్, ఎప్పటి మాదిరిగానే గురువారం ఉదయం ఎనిమిదిన్నరకు ఆఫీస్‌కి వెళ్లింది. సుమారు 9.20 గంటల సమయంలో నాలుగో అంతస్థుపైకి వెళ్ళి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది.  
 
వెంటనే తోటి ఉద్యోగులు ఆమెను ఆస్పత్రి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పని ఒత్తిడి కారణంగా శోభా లక్ష్మీనారాయణ్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని సహ ఉద్యోగులు చెప్తున్నారు. క్యాటీన్‌కు వెళ్లిన శోభా లక్ష్మీ నారాయణ్ నాలుగో అంతస్థు నుంచి ఉన్నట్టుండి దుమికేసింది. కిటికీల నుంచి ఉన్నట్టుండి దూకేయడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.