శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 31 జులై 2014 (15:49 IST)

ముంబై మోడల్ అత్యాచార ఫిర్యాదులో పూనం పాండే వాంగ్మూలం!

మహారాష్ట్ర సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ పరాస్కర్ తనపై అత్యాచారం చేశాడంటూ కొద్దిరోజుల క్రితం ముంబైకి చెందిన ఓ మోడల్ పెట్టిన కేసులో బాలీవుడ్ నటి, ప్రముఖ మోడల్ పూనం పాండే వద్ద ముంబై నగర పోలీసులు వాంగ్మూలం సేకరించాలని నిర్ణయించారు. ఈ అత్యాచారం కేసులో పరాస్కర్‌పై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. 
 
తాజాగా ఈ కేసులో సెన్సేషనల్ మోడల్ పూనం పాండే వాంగ్మూలాన్ని తీసుకోవాలని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు భావిస్తున్నారు. బాధితురాలు తన ఫిర్యాదులో పూనం పాండే పేరును ప్రధానంగా ప్రస్తావించింది. వృత్తివైరాన్ని మనసులో పెట్టుకుని పూనం ఈ కథంతా నడిపించిందని ఆమె ఆరోపించింది.
 
ప్రస్తుతం డీఐజీగా వ్యవహరిస్తున్న పరాస్కర్ ఏడాది క్రితం తనపై అత్యాచారం చేశాడని ఈ పాతికేళ్ళ మోడల్ మంగళవారం ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2012లో పరాస్కర్ ముంబయి నార్త్ జోన్ సీపీగా పనిచేస్తుండగా ఆయనను ఓ కేసు విషయంలో కలిశానని బాధితురాలు తెలిపింది. 
 
ఆ తర్వాత పరాస్కర్ తనతో చనువుగా ఉండేందుకు ప్రయత్నించేవాడని, ఆ తర్వాత ఓసారి అసభ్యంగా ప్రవర్తించాడని, మరోసారి ఏకంగా అత్యాచారానికే తెగబడ్డాడని ఆమె తన ఫిర్యాదులో వివరించింది. దీనికంతటికీ సూత్రధారి పూనం పాండేనని బాధిత మోడల్ పేర్కొంది.