శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 17 జూన్ 2016 (15:32 IST)

నన్నే అరెస్ట్ చేస్తారా? ఆరుగురు పోలీసుల్ని రఫ్ ఆడించిన 'తాగుబోతు' యువతి

మద్యం మత్తులో ఓ యువతి నానా రభస చేసింది. అంతేనా... విధుల్లో ఉన్న ఆరుగురు ఖాకీలకు తన చేతి దెబ్బను రుచి చూపించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమెను ఊచలు లెక్కబెట్టిస్తున్నారు. అందరికీ షాక్ ఇచ

మద్యం మత్తులో ఓ యువతి నానా రభస చేసింది. అంతేనా... వీధుల్లో ఉన్న ఆరుగురు ఖాకీలకు తన చేతి దెబ్బను రుచి చూపించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమెను ఊచలు లెక్కబెట్టిస్తున్నారు. అందరికీ షాక్ ఇచ్చే ఈ ఘటన గురువారం అర్థరాత్రి 1.15 గంటల సమయంలో ముంబైలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గౌరీ బిడే అనే మహిళ పూటుగా మద్యం సేవించి కారుని వేగంగా నడిపింది.
 
మద్యం మత్తులో వాహనాన్ని శరవేగంగా నడుతూ పోద్దార్ ఆస్పత్రి సమీపంలో డివైడర్కు ఢీకొట్టింది. ఆ సమయంలో యువతితో పాటు మరో ముగ్గురు యువకులు కూడా ఉన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్నపోలీసులు ఆమెను అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. నన్నేఅరెస్ట్ చేస్తారాంటూ.. నేనెవర్నో తెలుసా అంటూ నానా దుర్భాషలాడింది. 
 
అక్కడితో ఆగిపోలేదు... ఆరుగురు పోలీసులపై చేయి చేసుకుంది. అసభ్యకరంగా తిడుతూ నానా హంగామా సృష్టించింది. అయితే, ఆ యువతి ఎక్కవ మద్యం తాగిందా లేదా అనే విషయంపై పరీక్ష చేయిస్తున్నారు. ఆమెతోపాటు ఉన్న ముగ్గురుని కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.