శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 25 మార్చి 2017 (11:41 IST)

భార్యతో బ్రేకప్.. చివరిసారిగా ఇంటికి రమ్మన్నాడు.. వేడి నూనెను ముఖంపై పోసేశాడు..

భార్య విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ఆఖరి సారిగా హ్యాపీగా గడుపుదామని భర్త ఇంటికి రమ్మన్నాడు. ఇంటికొచ్చిన భార్యకు స్వయంగా తన చేతులారా చికెన్ ఫ్రై చేస్తానని చెప్పాడు. ఇందుకోసం నూనెను వేడి చేశాడు. క

భార్య విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ఆఖరి సారిగా హ్యాపీగా గడుపుదామని భర్త ఇంటికి రమ్మన్నాడు. ఇంటికొచ్చిన భార్యకు స్వయంగా తన చేతులారా చికెన్ ఫ్రై చేస్తానని చెప్పాడు. ఇందుకోసం నూనెను వేడి చేశాడు. కానీ ఆ నూనెను భార్య ముఖంపై పోసేశాడు. ఈ ఘటన ముంబైలో అజ్మీనగర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన భార్య మొహం 70శాతం కాలిపోయింది. ఆపై ఆ భర్త పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ముంబయికి చెందిన షదాబ్‌ అలీ ఇర్షాద్‌ షేక్‌ (31), మరియం భార్యాభర్తలు. వీరిద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్ధలు విడాకులకు దారితీశాయి. ఈ క్రమంలో వీరిద్దరూ రెండు నెలల పాటు విడివిడిగా ఉన్నారు. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న భర్త షేక్.. అజ్మీనగర్‌లో ఆమె ఉంటున్న ఇంటి దగ్గరికి వెళ్లి, చివరిసారిగా హ్యాపీగా గడుపుదామని.. లంచ్ చేద్దామని పిలిచాడు. 
 
అయితే భర్తను నమ్మి ఇంటికొచ్చిన భార్య మరియం ముఖంపై వేడి నూనె పోసేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఇర్షాద్ షేక్ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు.