శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : శుక్రవారం, 28 ఆగస్టు 2015 (09:11 IST)

అమ్మో... అమ్మ.. ? నన్ను కూడా చంపేసేదేమో... ! పోలీసు విచారణలో షీనా సోదరుడు,

షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి కుమారుడు మిఖైల్ బోరాను విచారించిన పోలీసులకు దిమ్మతిరిగి మైండు బ్లాంకు అయ్యింది. తన సోదరిని హత్య చేసిన తల్లి.. తరువాత తనను కూడా చంపేసేదేమోనని  మిఖైల్ బోరా గువాహటిలో సందేహం వ్యక్తం చేశారు. తన అమ్మ ఎంత శక్తిమంతురాలో కూడా చెప్పారు. పోలీసులు ముంబైకి పిలిస్తే ఈ కేసులో వారికి పూర్తిగా సహకరిస్తానని చెప్పాడు. 
 
కేసుకు సంబంధించి తన దగ్గరున్న ఆధారాలను సమర్పిస్తానన్నాడు. అమ్మ చాలా శక్తిమంతురాలు.. తాను ఏమైనా చేయగలదు అని అన్నాడు. తన పాన్ కార్డ్ను, బ్యాంక్ అకౌంట్ వివరాలను ఇవ్వాలని తల్లి తనను అడిగిందని. అయితే తాను ఇవ్వకుండా నిరాకరించానన్నాడు. ఆ తరువాత ముంబై నుంచి వచ్చిన ఓ పోలీసు అధికారి మిఖైల్‌ను అతని ఇంట్లోనే గంటపాటు విచారించారు. 
 
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.  కోల్‌కతాలో నిందితురాలు ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నాను, ముంబైలో ఇంద్రాణిని, ఆమె భర్త పీటర్ ముఖర్జియా కొడుకు రాహుల్‌ను పోలీసులు గురువారం రోజంతా విచారించారు.