శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 16 జూన్ 2017 (09:16 IST)

అమ్మాయిలతో రాసలీలలు... స్కూలు వ్యవస్థాపకుడే కీచకుడైన వేళ

ఓ పాఠశాల ట్రస్టీ అమ్మాయిలతో రాసలీలలు కొనసాగించాడు. ఓ మహిళా ఉపాధ్యాయురాలినేకాకుండా, ఆమె సహకారంతో పలువురు అమ్మాయిలతో జల్సాలు చేశాడు. అంతేనా 12వ తరగతి చదివే అమ్మాయిని ఏకంగా యూరప్ పర్యటనకు తీసుకెళ్లాడు. మ

ఓ పాఠశాల ట్రస్టీ అమ్మాయిలతో రాసలీలలు కొనసాగించాడు. ఓ మహిళా ఉపాధ్యాయురాలినేకాకుండా, ఆమె సహకారంతో పలువురు అమ్మాయిలతో జల్సాలు చేశాడు. అంతేనా 12వ తరగతి చదివే అమ్మాయిని ఏకంగా యూరప్ పర్యటనకు తీసుకెళ్లాడు. ముంబైలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ముంబైలోని ప్రముఖ వెస్ట్రన్ సుబుర్బ్ పాఠశాల ఉంది. ఈ పాఠశాల వ్యవస్థాపక ట్రస్టీగా ఉన్న ఓ కామాంధుడు ఓ మహిళా ఉపాధ్యాయురాలితోపాటు మూడేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆ ట్రస్టీ 12వతరగతి చదువుతున్న ఓ అమ్మాయితో కలిసి యూరప్ దేశ పర్యటనకు వెళ్లాడు. ఇలా పలువురు బాలికలపై ట్రస్టీనే అత్యాచారాలకు పాల్పడ్డాడనే విషయంపై పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. 
 
ట్రస్టీపై రేప్ కేసు నమోదైన నేపథ్యంలో అమ్మాయి యూరప్ పర్యటన నుంచి తిరిగివచ్చినా ట్రస్టీ రాలేదు. దీంతో అత్యాచారం కేసుల్లో నిందితుడిని యూరప్ నుంచి ముంబైకు రప్పించేందుకు బాలల హక్కుల కమిషన్ యత్నాలు ఆరంభించింది. మొత్తంమీద పాఠశాలలో పలువురు టీచర్లతోపాటు విద్యార్థినులపై పాఠశాల వ్యవస్థాపకుడే అత్యాచారానికి పాల్పడిన ఘటన ముంబయి నగరంలో సంచలనం రేపింది.