శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 23 సెప్టెంబరు 2014 (19:09 IST)

నరేంద్ర మోడీతో తన బంధం పవిత్రమైనది : రాజ్‌నాథ్ సింగ్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తన బంధం పవిత్రమైనదని, భావోద్వేగమైందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీకి, తనకూ మధ్య విభేదాలున్నాయంటూ వస్తున్న వార్తలపై రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం స్పందించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. మోడీతో తన బంధం పవిత్రమైనదని, భావోద్వేగమైందని, అలాగే చాలా లోతైనదన్నారు. తనకు వ్యక్తిగతంగా హాని జరిగినా సరే తమ మధ్య బంధం మాత్రం చెక్కుచెదరదన్నారు. 
 
గత సంవత్సరంన్నర నుంచి తమ మధ్య మా ఇద్దరి మధ్య సంబంధం మరింతగా పెరిగిందేకానీ, ఏమాత్రం తగ్గలేదన్నారు. కాగా, కేంద్ర కేబినెట్ పై మోడీ చూపుతున్న ప్రాధాన్యం చాలా సాధారణమైందని, కావాలనేమి చేయడం లేదని స్పష్టం చేశారు.