గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 9 సెప్టెంబరు 2017 (10:52 IST)

ప్రియురాలిపై రేప్ చేశాడు.. స్నేహితుడికీ పంచాడు.. తర్వాత కత్తితో పొడిచి?

ప్రేమ పేరుతో వంచించి తన కోర్కె తీర్చుకోవడంతో పాటు తన స్నేహితుడికి కూడా ప్రియురాలిని పంచిపెట్టిన ఓ కామాంధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రియురాలిపై స్నేహితుడితో కలిసి అత్యాచారానికి పాల్పడమే కాకుండా యు

ప్రేమ పేరుతో వంచించి తన కోర్కె తీర్చుకోవడంతో పాటు తన స్నేహితుడికి కూడా ప్రియురాలిని పంచిపెట్టిన ఓ కామాంధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రియురాలిపై స్నేహితుడితో కలిసి అత్యాచారానికి పాల్పడమే కాకుండా యువతిని దారుణంగా హతమార్చారు. ఈ ఘటన కర్ణాటకలోని బెళగావిలో బుధవారం చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే... నాగపూర్‌కు చెందిన 22 ఏళ్ల ప్రీతి రెండేళ్లుగా ముంబైలోని ఓ కాల్ సెంటర్లో పనిచేస్తోంది. అదే నగరానికి చెందిన యువకుడిని ఆమె ప్రేమిస్తోంది. అతడితో కలిసి ఆ యువతిని రత్నగిరి విహారయాత్రకంటూ బయటికి వచ్చింది. అయితే ఆమె ప్రియుడు, అతని స్నేహితుడు.. ఓ లాడ్జిలో దిగారు. అదే రోజు రాత్రి ప్రియుడు తన స్నేహితుడితో కలసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
కానీ ఆ విషయాన్ని బయటపెడుతుందేమోనని ఇద్దరూ కలిసి ఆమెను కత్తితో పొడిచి హతమార్చారు. తర్వాత యువతి మృతదేహాన్ని బ్యాగులో కుక్కి కారులో బెళగావికి తీసుకువచ్చారు. రాణి కిత్తూరు చెన్నమ్మ వర్సిటీ వద్ద ఉన్న వంతెన కింద పడేసి నిందితులు రత్నగిరికి వెళ్లిపోయారు.

మద్యం మత్తులో కారు డ్రైవర్‌కు అమ్మాయిని హతమార్చామని తెలిపారు. దీంతో కారు డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. నిందితులను అరెస్ట్ చేశారు.