శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 27 ఆగస్టు 2014 (11:19 IST)

ట్విట్టర్ ఫాలోయింగ్‌లోనూ నరేంద్ర మోడీనే టాప్!

ప్రధాని నరేంద్ర మోడీకి, తన ఆకట్టుకునే ప్రసంగంతో గడచిన ఎన్నికల్లో ప్రజాభిమానం వెల్లువెత్తింది. ఎన్నికలు ముగిసి మూడు నెలలైనా మోడీకి ట్విట్టర్‌లో ఏమాత్రం ఫాలోయింగ్ తగ్గలేదు. తాజాగా బీజేపీ విడుదల చేసిన ఓ నివేదికే ఇందుకు నిదర్శనం. 
 
పార్టీ తరఫున కొనసాగుతున్న ట్విట్టర్ ఫాలోయింగ్ లో నేటికీ మోడీ, అగ్రస్థానంలోనే నిలిచారు. 82 లక్షల మంది ఫాలోయర్లు, నిత్యం మోడీ ట్విట్టర్ అకౌంట్ ను సందర్శిస్తూ ఉంటారు. మోడీ తర్వాత ట్విట్టర్ ఫాలోయింగ్‌లో బీజేపీ నేతలెవ్వరూ దాదాపు దరిదాపుల్లో కూడా లేరనే చెప్పాలి. 
 
14 లక్షల మంది ఫాలోయర్లతో విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, మోడీ తర్వాతి స్థానంలో నిలిచారు. ఆ తర్వాత మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ 6.52 లక్షల మంది ఫాలోయర్లతో మూడో స్థానంలో ఉన్నారు.