శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 25 మే 2015 (15:12 IST)

నవవధువుపై.. మామ.. బంధువుల అత్యాచారం!

నవవధువుపై బంధువులే అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. థానేలో ఉన్న ప్రాంతానికి చెందిన నవవధువు తన బంధువులకు చెందిన ఓ నిశ్చితార్థ వేడుకకు వెళ్ళింది. నవవధువుతో ఆమె భర్త, మామ వెళ్లారు. పక్క గ్రామంలో జరిగిన నిశ్చితార్థం వేడుక ముగిశాక ఇంటికెళ్లేందుకు తన భర్త, మామ కోసం నవవధువు వెతికింది. 
 
అయితే అప్పటికే వాళ్లు ఇంటికెళ్లిపోయినట్లు బంధువులు చెప్పడంతో.. ఇక చేసేదేమీలేక ఒంటరిగానే ఇంటికి ప్రయాణమైంది. కానీ దారి మధ్యలోనే దట్టమైన అడవీ ప్రాంతంలో ఆమె అత్యాచారానికి గురైంది. నవవధువుపై ఆమె మామ బంధువులచే అత్యాచారానికి గురైనట్లు తెలిసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.