శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2017 (17:34 IST)

తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష వద్దు.. స్టే విధించిన హైకోర్టు.. స్టాలిన్ కొత్త ఎత్తుగడ

తమిళ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి దూకుడుకు కళ్లేం వేసేందుకు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ కొత్త ఎత్తుగడ వేశాడు. డీఎంకే ఎమ్మెల్యేలకు స్

తమిళ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి దూకుడుకు కళ్లేం వేసేందుకు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ కొత్త ఎత్తుగడ వేశాడు. డీఎంకే ఎమ్మెల్యేలకు స్పీకర్‌ ధన్‌పాల్‌ నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మూకుమ్మడిగా పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని స్టాలిన్‌ యోచిస్తున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా రాజీనామా చేస్తే -స్పీకర్‌ ధన్‌పాల్‌ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. 
 
ఈ నేపథ్యంలో శాసనసభలో బలపరీక్ష నిర్వహించొద్దని మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసిన నేపథ్యంలో... తమపై అనర్హత వేటును వ్యతిరేకిస్తూ సదరు ఎమ్మెల్యేలు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనర్హత పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం బుధవారం విచారణను చేపట్టింది. 
 
విచారణ అనంతరం తీర్పును వెలువరించిన హైకోర్టు బలపరీక్షపై స్టే విధించింది. అదేవిధంగా అనర్హతపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు 18 ఎమ్మెల్యేల స్థానాల్లో ఎన్నికలు నిర్వహించొద్దని ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 4కు వాయిదా వేసింది.