శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 30 మార్చి 2015 (15:20 IST)

ప్రధానిని బీట్ చేసిన షారూఖ్ ఖాన్ : ట్విట్టర్ ఫాలోవర్స్‌లో కింగ్ ఖాన్‌దే..

సామాజిక వెబ్‌సైట్ ట్విట్టర్లో బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ అభిమానగణం మరింత పెరిగింది. రెండు రోజుల (శనివారం) క్రితం ఆయనను అనుసరిస్తున్నవారి సంఖ్య 12 మిలియన్ల (కోటి 20 లక్షలు)కు చేరుకుంది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని... కింగ్ ఖాన్ అధిగమించాడు. 
 
మోడీని ప్రస్తుతం 11.1 మిలియన్ల మంది అభిమానులు అనుసరిస్తున్నారు. దాంతో, ప్రధానికన్నా ఈ బాలీవుడ్ నటుడు ముందున్నట్టు ట్విట్టర్ పేర్కొంది. మరోవైపు, 13.9 మిలియన్ల అభిమానగణంతో వారిద్దరికన్నా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ముందు వరుసలో ఉన్నారు.
 
ఇదిలా ఉంటే ఐదవసారి ప్రపంచకప్ గెలుచుకుని విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుకు టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అభినందనలు తెలిపాడు. "కంగ్రాచ్యులేషన్స్ టు ఆస్ట్రేలియా టీమ్" అంటూ ధోనీ పోస్టు చేశాడు.