శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (18:02 IST)

మొబైల్ పనిచేయలేదు.. మార్చివ్వలేదని.. తల్లీకూతుళ్ల ఓవరాక్షన్.. ఢిల్లీలో దారుణం..

దేశ రాజధాని ఢిల్లీ నేరాలకు అడ్డాగా మారిపోయింది. ఓ వైపు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే.. మరోవైపు నేరాల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ఢిల్లీలోని ఓ మొబైల్ దుకాణంలో ముగ్గురు మహిళలు హల్‌చల్ చేశారు.

దేశ రాజధాని ఢిల్లీ నేరాలకు అడ్డాగా మారిపోయింది. ఓ వైపు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే.. మరోవైపు నేరాల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా  ఢిల్లీలోని ఓ మొబైల్ దుకాణంలో ముగ్గురు మహిళలు హల్‌చల్ చేశారు. 
 
తమ మొబైల్ బాగు చేయలేదని ఆరోపిస్తూ దుకాణంలో టేబుల్ కిందపడేసి, హంగామా సృష్టించారు. సదరు దుకాణంలో తల్లీకూతుళ్లు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇదంతా సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఈ ఘటన ఢిల్లీలోని రాజౌరీ ప్రాంతంలో చోటుచేసుకుంది.  
 
సీసీ టీవీలో రికార్డైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సదరు వీడియోలో ముగ్గురు మహిళలు షో రూమ్‌లోని వస్తువులను ధ్వంసం చేశారు. షోరూమ్‌లో పనిచేస్తున్న వారిపై చేజేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఓ మహిళ ఇటీవలే ఈ షో రూం నుంచి ఓ మొబైల్ కొనుగోలు చేసింది. కానీ ఆ మొబైల్ సరిగా పని చేయలేదు. దీంతో ఆమె షో రూంకు వచ్చింది. వేరొక మొబైల్ మార్చి ఇవ్వాలని చెప్పింది. 
 
కానీ షో రూమ్ వాళ్లు మొబైల్‌ను మార్చేందుకు నో చెప్పారు. అంతే నాణ్యత లేని మొబైల్ ఇచ్చారంటూ.. సదరు మహిళ, ఆమె కుమార్తె షో రూంలో హంగామా సృష్టించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.