శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 2 జులై 2015 (10:45 IST)

నాపై రాజకీయకుట్ర జరుగుతోంది : మంత్రి పకంజ ముండే

తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని మహారాష్ట్ర మంత్రి పంకజ ముండే ఆరోపించారు. పల్లీ చిక్కీలు, పుస్తకాలు, మ్యాట్లు మొదలైన వస్తువుల కొనుగోలుపై 206 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని మహారాష్ట్రలో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న విమర్శలను ఆమె తిప్పికొట్టారు.
 
ఇది కేవలం మాటల కుంభకోణమని తేల్చిపారేశారు. పల్లీ చిక్కీ కుంభకోణం అంటూ విమర్శలు చేస్తున్న ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉండగా, ఇవే వస్తువులను 408 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారని, దాన్నేమంటారని ప్రశ్నించారు. 
 
పైగా తాను ఎలాంటి కుంభకోణానికి పాల్పడలేదని, తన మంత్రి వర్గ శాఖ ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఆమె స్పష్టం చేశారు. ఇదంతా తనపై జరుగుతున్న రాజకీయ కుట్రలో భాగమేనని ఆమె స్పష్టం చేశారు. ఏసీబీ అడిగే ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆమె చెప్పారు.