శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 27 ఏప్రియల్ 2017 (13:19 IST)

కొడనాడు ఎస్టేట్ సెక్యూరిటీ గార్డు హత్య.. శశికళ సన్నిహితుల వద్ద విచారణ?

దివంగత జయలలిత కొడనాడు ఎస్టేట్ సెక్యూరిటీ గార్డును హతమార్చడం సినీ ఫక్కీలో జరిగిపోయింది. ఈ హత్య ఆస్తులకు సంబంధించే ఈ హత్య జరిగిందని.. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. సోమవారం పలువ

దివంగత జయలలిత కొడనాడు ఎస్టేట్ సెక్యూరిటీ గార్డును హతమార్చడం సినీ ఫక్కీలో జరిగిపోయింది. ఈ హత్య ఆస్తులకు సంబంధించే ఈ హత్య జరిగిందని.. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. సోమవారం పలువురు వ్యక్తులు ఎస్‌యూవీ వాహనంలో వచ్చి, గార్డును హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగా కోయబత్తూరుకు చెందిన ఓ ఐటీ కంపెనీ సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తోంది.
 
ఫుటేజీ వివరాలు త్వరలో వస్తాయని పోలీసులు చెప్తున్నారు. అయితే సెక్యూరిటీ గార్డును హత్య చేయడం వెనుక ఎలాంటి వ్యక్తిగత కారణాలు లేవని కనిపిస్తోందని చెప్తున్నారు. జయలలిత ఎస్టేట్ సెక్యూరిటీ గార్డును హత్య చెయ్యడానికి సినిమా ఫక్కీలో ప్లాన్ వేశారని పోలీసు అధికారులు గుర్తించారు.
 
హత్య చేసి పారిపోయే సమయంలో హంతకులు కొన్ని వస్తువులు వదిలి వెళ్లారని, వాటిని స్వాధీనం చేసుకున్నామని బుధవారం దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు చెప్పారు. అయితే ఈ హత్య కేసులో శశికళ సన్నిహితులను విచారించడానికి పోలీసు అధికారులు సిద్ధమయ్యారని తెలిసింది. కొడనాడు ఎస్టేట్ బంగ్లాలో జయలలితకు చెందిన బంగారు నగలు, భారీ మొత్తంలో నగదు ఉందని అనుమానంతో వాటిని లూటీ చెయ్యడానికి దుండుగులు ప్రయత్నించారని ఊహాగానాలు సాగుతున్నాయి.