శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : సోమవారం, 27 ఏప్రియల్ 2015 (10:22 IST)

ఆ ప్రిన్సిపాల్.. ఓ కామపిశాచి.. విద్యార్థిని ఒంటరిగా కనిపించిందో రేప్..

ఉత్తరప్రదేశ్ లోని ఆ ప్రిన్సిపల్ కు బాలిక ఒంటరిగా కనిపించిందో... ఆయనలోని కామపిశాచి బుసలు కొడుతుంది. అతని దృష్టంతా ఆ బాలికను లైంగికంగా లొంగదీసుకోవడంపైనే ఉంటుంది. వినకపోతే నేరుగా మానభంగమే చేసేస్తాడు. ఆ ప్రధానాచార్యుడి ముసుగులో ఉన్న కామాంధుడి ఆఘాయిత్యాలు ఇటీవల బయటపడ్డాయి. ముజఫరాబాద్ లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.  
 
ఉత్తరప్రదేశ్లో రాష్ట్రం ముజఫర్నగర్ సమీపంలో ప్రైవేట్ స్కూల్ నడుపుతున్న ప్రిన్సిపాల్ దినేష్ కుమార్ ఆరో తరగతి విద్యార్థిని(15)ని అత్యాచారం చేశాడు. ఆ బాలిక తరగితికి మించిన వయసు. వయసుకు మించిన శరీర ఆకృతి కనిపించడంతో ఆ ప్రిన్సిప్ లోని కామాంధుడు లేచి కూర్చున్నాడు. ఎలాగైనా సరే తన కోరిక తీర్చుకోవాలనుకున్నాడు. 
 
హోం వర్క్ పేరుతో బాలికను స్కూల్లోనే ఉంచుకుని దారుణానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెప్పవద్దంటూ బెదిరించాడు. బాధితురాలి ఇంటికి వెళ్లాక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రిన్సిపాల్ను అరెస్ట్ చేశారు.