శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 28 మార్చి 2015 (20:17 IST)

రాహుల్ త్వరలోనే ప్రజాజీవితంలోకి వస్తాడు : సోనియా

తన కుమారుడు రాహుల్ గాంధీ అజ్ఞాతవాసంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తాజాగా స్పందించారు. రాహుల్ బాబు త్వరలోనే ప్రజా జీవితంలోకి వస్తారంటూ వ్యాఖ్యానించారు. అలాగే, అమేథీలో జరిగిన రైలు ప్రమాద మృతుల కుటుంబాలను ఆయన పరామర్శిస్తారని తెలిపారు. 
 
పార్లమెంట్ సమావేశాలకు సైతం డుమ్మాకొట్టి గత కొంతకాలంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ ఎవరికీ కనిపించకుండా తప్పించుకుని తిరుగుతున్న విషయం తెల్సిందే. దీనిపై ఇప్పటికే పలు పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నా.. రాహుల్ గాంధీ మాత్రం మిన్నుకుండి పోయారు. రాహుల్ ఎక్కడకు వెళ్లారనే అంశం అటు నాయకుల నుంచి ఇటు ప్రజల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.
 
ఈ నేపథ్యంలో రాహుల్ తల్లి, ఏఐసీసీ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ తాజాగా స్పందించారు. రాహుల్ బాబు త్వరలోనే ప్రజా జీవితంలోకి వస్తాడంటూ స్పష్టం చేశారు. కాగా, రాహుల్ ఎప్పుడూ తిరిగి వస్తారనే దానిపై సోనియా స్పష్టత ఇవ్వలేదు.