శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 27 జూన్ 2017 (09:19 IST)

రైలు టాయ్‌లెట్‌లో మహిళ.. వెంటిలేటర్ నుంచి మొబైల్‌లో వీడియో చిత్రీకరణ

రైలు ప్రయాణికులకు రక్షణగా ఉండాల్సిన ఓ రైల్వే ఉద్యోగి పాడుపనికి పాల్పడ్డాడు. రైలు బాత్రూమ్‌లో మూత్రవిసర్జనకు వెళ్లే మహిళా ప్రయాణికురాలిని వెంటిలేటర్ నుంచి మొబైల్ ద్వారా వీడియో తీసి అడ్డంగా బుక్కయ్యాడు.

రైలు ప్రయాణికులకు రక్షణగా ఉండాల్సిన ఓ రైల్వే ఉద్యోగి పాడుపనికి పాల్పడ్డాడు. రైలు బాత్రూమ్‌లో మూత్రవిసర్జనకు వెళ్లే మహిళా ప్రయాణికురాలిని వెంటిలేటర్ నుంచి మొబైల్ ద్వారా వీడియో తీసి అడ్డంగా బుక్కయ్యాడు. దీంతో రైలు ప్రయాణికులంతా కలిసి అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన గోరఖ్‌పూర్ - లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... ముంబై, కళ్యాణ్ నగరానికి చెందిన షేక్ సలీం అనే యువకుడు రైల్వేలో ఏసీ మెకానిక్‌గా పనిచేస్తూ విధినిర్వహణలో భాగంగా గోరఖ్‌పూర్ - లోకమాన్య తిలక్ టెర్మినల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. ఇదే రైలులోని ఏ-1 ఏసీ కోచ్‌లో థానే నగరానికి చెందిన 50 ఏళ్ల ఓ మహిళ ప్రయాణిస్తూ బాత్రూమ్‌కు వెళ్లింది. దీన్ని గమనించిన సలీం... వెంటిలేటరు నుంచి తన మొబైల్‌ఫోన్ సాయంతో రహస్యంగా వీడియో చిత్రీకరించాడు. 
 
ఇంతలో మొబైల్ ఫోన్ అలారం మోగడంతో బాత్రూమ్‌లో ఉన్న మహిళకు తనను రహస్యంగా చిత్రీకరిస్తున్నట్లు గుర్తించింది. తోటి ప్రయాణికుల సాయంతో సలీంను పట్టుకుని పోలీసులకు అప్పగించింది. ఆ తర్వాత అతని మొబైల్ ఫోన్‌ను తనిఖీ చేయగా అందులో అనేక అర్ధనగ్న ఫోటోలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో మహిళా ప్రయాణికురాలి ఫిర్యాదుమేరకు నిందితుడైన సలీంపై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.