శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (10:50 IST)

వరసకు సోదరుడు.. అయినా వేధిస్తున్నాడు.. ఇక తాళలేను.. చెరువులో దూకేస్తున్నా..

బాలికలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కామాంధులు చిన్నారులపై కూడా విరుచుకుపడుతున్నారు. వావివరుసలు లేకుండా బాలికలపై దురాచారాలకు ఒడిగడుతున్నారు. తాజాగా సోదరుడి వరుసైన దగ్గరి బంధువే తనను లైంగికంగా వ

బాలికలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కామాంధులు చిన్నారులపై కూడా విరుచుకుపడుతున్నారు. వావివరుసలు లేకుండా బాలికలపై దురాచారాలకు ఒడిగడుతున్నారు. తాజాగా సోదరుడి వరుసైన దగ్గరి బంధువే తనను లైంగికంగా వేధిస్తుండటంతో మనోవేదనకు గురైన ఓ బాలిక చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. జైపూర్ నగరంలోని రైజింగ్ నగర్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల బాలికను సోదరుడి వరుసైన దగ్గరి బంధువు సోనీ బల్వీర్ గత కొంత కాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో ఆవేదన చెందిన బాలిక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడైన సోనీ బల్వీర్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.