శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 29 జులై 2015 (19:36 IST)

మహాత్మ కలాంజీని భగవంతుడు ప్రేమగా కలిపేసుకున్నాడు... రజినీకాంత్

భారతరత్న అబ్దుల్ కలాం కాలం చేయడంపై తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇలా చెప్పుకున్నారు. " మహాత్మా గాంధీజీ, కామరాజ్ లేదా భారతీయార్ తదితర మహాత్ములను చూసే భాగ్యం నాకు కలుగలేదు. కానీ మహాత్మ కలాంజీతో జీవించే అవకాశం కలిగింది. ఎంతో కఠినమైన కష్టాలను పడిన ఆయన ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అయినప్పటికీ చాలా సామాన్యమైన జీవితాన్ని గడిపారు. 
 
కోట్లాది మంది ప్రజల హృదయాల్లో చిరస్థానం సంపాదించారు. విద్యార్థి లోకాన్ని జాగృతం చేసేందుకు అహరహం పాటుపడ్డారు. వారిని అన్ని స్థాయిల్లోకీ తీసుకెళ్లారు. ఆశ్చర్యకరంగా ఆ భగవంతుడు నిశ్శబ్దంగా ప్రేమగా తనలో కలిపేసుకున్నాడు. ఆయన ఆత్మకు శాంతి కలుగాలని కోరకుంటున్నా" అని పేర్కొన్నారు.