1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (11:36 IST)

బాలికపై అత్యాచారం.. తలనరికేశారు.. నిందితులను ప్రజలు ఏం చేశారంటే?

అత్యాచార నిందితులను ప్రజలే శిక్షించారు. చట్టంలో వున్న లొసుగులతో తప్పించుకుని తిరిగేవారు కొందరుంటే... కఠినమైన శిక్షలు లేకపోవడం వల్ల నేరాలు చేసే వారి సంఖ్య మరోవైపు పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో అరుణాచల్ ప్

అత్యాచార నిందితులను ప్రజలే శిక్షించారు. చట్టంలో వున్న లొసుగులతో తప్పించుకుని తిరిగేవారు కొందరుంటే... కఠినమైన శిక్షలు లేకపోవడం వల్ల నేరాలు చేసే వారి సంఖ్య మరోవైపు పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రజలే అత్యాచార నిందితులకు శిక్ష విధించారు.

ఇద్దరు అత్యాచార నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి లాకప్‌లో వుంచగా.. అప్పటికే తీవ్ర ఆగ్రహంతో వున్న ప్రజలు మూకుమ్మడిగా దాడి చేశారు. వారిని లాకప్‌ నుంచి బయటికి లాక్కొచ్చి చంపేశారు. ఈ ఘటన అరుణాచల్ ప్రదేశ్‌ లోహిత్ జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. తేయాకు తోటలో పనిచేసే సంజయ్ సోబోర్ (30), జగదీష్ లోహార్ (25)లు ఈ నెల 12వ తేదీన ఐదున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేగాకుండా చిన్నారి తలను నరికేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పాప మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ కేసు విచారణలో సంజయ్, జగదీష్‌లే నిందితులని తేలింది. 
 
పోలీసులు నిందితులు లాకప్‌లో వుంచారు. దీంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అంతే వందలాది మంది ప్రజలు పోలీస్ స్టేషన్‌కు వచ్చి.. నిందితులను లాకప్ నుంచి వెలుపలికి లాక్కెళ్లి కొట్టి చంపారు. ఈ ఘటనపై నిరసనకారులను అదుపు చేయలేకపోయిన ముగ్గురు పోలీసులను సస్పండ్ చేశారు.