శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : మంగళవారం, 30 జూన్ 2015 (14:36 IST)

జయలలిత ఘన విజయం.. 1,51,252 ఓట్ల మెజారిటీ

తమిళనాడు ముఖ్యమంత్రి పోటీ చేసిన ఆర్కే నగర్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత 1,51,252 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు చెన్నైలోని రాణి మేరీ కళాశాలలో మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభంకాగా ఆది నుంచే అమ్మ ఆధిక్యత కొనసాగింది. 
 
ఈ నేపథ్యంలో జయలలిత 1,60,921 ఓట్లను పొంది, 1,51,252 ఓట్ల తేడాతో ఘన విజయం పొందారు. ఈమెపై పోటీ చేసిన మహేంద్రన్ 9,669 ఓట్లను మాత్రమే పొందగలిగారు. ఈ ఎన్నికలో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి ట్రాఫిక్ రామసామి డిపాజిట్‌ను కోల్పోయారు. తమ అధినేత్రి ఘన విజయం పొందడంతో పార్టీ కార్యకర్తలు పండగ చేసుకుంటున్నారు.