శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (09:02 IST)

శశికళ వెన్నులో వణుకు.. రాత్రంతా ఎమ్మెల్యేలతో గడిపిన చిన్నమ్మ

ముఖ్యమంత్రి దివంగత జయలలిత ప్రియనెచ్చెలి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే.శశికళ వెన్నులో వణుకు మొదలైంది. జయలలిత అక్రమాస్తుల కేసులో ఆమె రెండో నిందితురాలిగా ఉన్నారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న జయ

ముఖ్యమంత్రి దివంగత జయలలిత ప్రియనెచ్చెలి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే.శశికళ వెన్నులో వణుకు మొదలైంది. జయలలిత అక్రమాస్తుల కేసులో ఆమె రెండో నిందితురాలిగా ఉన్నారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న జయలలిత గత యేడాది డిసెంబర్ 5వ తేదీన కన్నుమూసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన శశికళ... ఇపుడు ముఖ్యమంత్రి కుర్చీ కోసం పోటీపడ్డారు. అయితే, నిన్నామొన్నటి వరకు నమ్మినబంటుగా ఉన్న పన్నీర్ సెల్వం తిరుగుబాటుతో ఆమె సీఎం పీఠానికి అడుగుదూరంలో వచ్చి ఆగిపోయింది. 
 
ఇంతలో గత యేడాది జూన్ నెలలో ముగిసిన జయలలిత అక్రమాస్తుల కేసులో తుది తీర్పును మంగళవారం వెల్లడించనున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. దీంతో ఆమె వణికి పోయారు. ఆ వెనువెంటనే తన వర్గ ఎమ్మెల్యేలు బస చేస్తున్న కూవత్తూరులోని గోల్డన్ బే రిసార్ట్స్‌కు వెళ్లిపోయారు. సోమవారం రాత్రంతా అక్కడే ఉన్నారు. 
 
మంగళవారం ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు తీర్పు వెల్లడి కానుంది. ఈ తీర్పు తనకు సానుకాలంగా వస్తే... అక్కడ నుంచి ఎమ్మెల్యేలతో ఊరేగింపుగా చెన్నైలోని పోయెస్ గార్డెన్‌కు తిరిగిరావాలన్న తలంపులో ఉన్నారు. ఒకవేళ కేసులో దోషిగా తేలితే మాత్రం... ఆమెను ఆ రిసార్టులోనే అరెస్టు చేసేందుకు పోలీసులు సర్వసన్నద్ధంగా ఉన్నారు. మొత్తంమీద శశికళ వెన్నులో వణుకుమొదలైంది.