శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : బుధవారం, 26 ఆగస్టు 2015 (19:59 IST)

ట్విస్ట్... ఇంద్రాణి మొదటి భర్త అరెస్ట్.... రెండో మొగుడు కొడుకుతో కూతురు... హత్య..

షీనా బోరా హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఆమె హత్యకు కన్నతల్లితోపాటు కన్నతండ్రి కూడా చేయివేసినట్లు పోలీసులు విచారణలో తేలినట్లు సమాచారం. దీనితో అతడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. కాగా తన కన్నకూతురు షీనా బోరా హత్య కేసులో ఆమె తల్లి, మీడియా టైకూన్ ఇంద్రాణి ముఖర్జీని ముంబై పోలీసులు మంగళవారం నాడు అరెస్టు చేశారు. 
ఫేస్ బుక్ ఫోటో
 
అరెస్టు చేసి ఆమెను బాంద్రా కోర్టులో ప్రవేశపెట్టగా ఆమెకు ఆగస్టు 31 వరకూ కస్టడీ విధించారు. ఈ హత్య మిస్టరీ ఇంద్రాణి కారు డ్రైవరును పోలీసులు అరెస్టు చేసి, తమదైన శైలిలో విచారణ చేయగా గుట్టు రట్టయింది. షీనాను హత్య చేసి ఆమె శరీరాన్ని అడవిలో పారవేయమన్నది ముఖర్జీయేనని అతడు చెప్పడంతో పోలీసులు ఈమెను అరెస్టు చేశారు. ఈ క్రమంలో 
 
ఇంద్రాణి గురించి నాలుగు పాయింట్లు...
* స్టార్ ఇండియా సీఈఒ పీటర్ ముఖర్జీ భార్యే ఇంద్రాణి ముఖర్జీ. ఆమె వయసు 43 ఏళ్లు.
* పీటర్‌ను 2002లో ఇంద్రాణి రెండో వివాహం చేసుకున్నది. వీరిద్దరికీ ఓ అమ్మాయి పుట్టింది.
* షీనా బోరా తొలుత ఇంద్రాణి సోదరి అనుకున్నారు. కానీ షీనా బోరా ఇంద్రాణి మొదటి భర్తకు కలిగిన సంతానం. ఈ విషయాన్ని మిహెల్ బోరా వెల్లడించారు.
* మిహైల్, షీనా ఇద్దరూ ఇంద్రాణి పిల్లలే. వీరిద్దరే మొదటి భర్త ద్వారా కలిగిన సంతానం. వీరు గౌహతిలోని తమ గ్రాండ్ పేరెంట్స్ వద్ద పెరిగారు.
 
ముంబైలో 2012లో సంచలనం సృష్టించిన షీనా బోరా కేసు మిస్టరీ మెల్లమెల్లగా తొలగిపోతోంది. షీనా బోరా తొలుత ఇంద్రాణి ముఖార్జియా సోదరి అని అనుకున్నారంతా. కానీ అది నిజం కాదని తేలింది. పైగా ఆమెను హత్య చేయడానికి వెనుక ఉన్న కారణం కూడా ఆస్తి వ్యవహారం కాదనీ, మరొకటని ఆమె భర్త పీటర్ ముఖార్జియా చెప్పడంతో వెలుగుచూసింది. 
 
ఇంద్రాణి అరెస్టు, షీనా హత్య గురించి పీటర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. అసలు షీనా బోరా తన కుమారుడితో ఎఫైర్ పెట్టుకున్నదనీ, ఐతే అది తమ ఇద్దరికీ ఇష్టం లేదని చెప్పాడు. ఐతే షీనా స్వయంగా తన భార్య ఇంద్రాణి కుమార్తె అని తనకు తెలియదనీ, ఆమె కూడా ఏనాడూ ఆమె తన కుమార్తె అని తనతో చెప్పలేదని వెల్లడించాడు. ఐతే తాము వారిద్దరి ఎఫైర్‌ను అంగీకరించకపోయినప్పటికీ వారిరువురు తమతమ సంబంధాన్ని కొనసాగించారనీ, అది ఇంద్రాణికి పూర్తిగా ఇష్టం లేదని పీటర్ చెప్పుకొచ్చారు.
 
ఈ వ్యవహారంలో తనను ఇంతకాలం చీకట్లో ఉంచారని తనకు ఇప్పుడే అర్థమైందని స్టార్ ఇండియా మాజీ చీఫ్ పీటర్ చెప్పుకొచ్చారు. షీనా 2012 నుంచి కనిపించకపోవడంతో ఆమెను మర్చిపొమ్మని తన కుమారిడితో చెప్పానని వెల్లడించారు. ఐతే మరోసారి షీనా గురించి అడుగగా ఆమె పైచదువుల కోసం అమెరికా వెళ్లినట్లు ఇంద్రాణి తనతో చెప్పిందనీ, దాంతో ఆ విషయాన్ని అంతటితో వదిలేసినట్లు చెప్పుకొచ్చారు. 
 
ఐతే అసలు నిజం తెలిసి తను దిగ్భ్రాంతికి లోనవుతున్నట్లు చెప్పారు. కాగా పీటర్ ముఖార్జియా ఇంద్రాణిని 2002లో ఆమె స్టార్ ఇండియా నెట్‌వర్క్ హెచ్‌ఆర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న సమయంలో వివాహం చేసుకున్నారు. ఐతే అప్పటికే ఆమెకు పెళ్లయి షీనా బోరా జన్మించి ఉన్న సంగతి పీటర్ కు తెలియదని అతడు చెప్పేదాన్ని బట్టి తెలుస్తోంది.