బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 14 జులై 2018 (13:44 IST)

అయోధ్యలో అసలు బాబ్రీ మసీదే లేదు: వసీం రిజ్వీ సెన్సేషనల్ కామెంట్స్

అయోధ్యలో వున్నది మసీదు కాదని.. అది రామ జన్మభూమి అని షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ వసీం రిజ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడ రామ మందిరం మాత్రమే నిర్మించబడుతుందని... బాబర్ సానుభూతిపరులంతా ఓడిపోవడా

అయోధ్యలో వున్నది మసీదు కాదని.. అది రామ జన్మభూమి అని షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ వసీం రిజ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు.  అక్కడ రామ మందిరం మాత్రమే నిర్మించబడుతుందని... బాబర్ సానుభూతిపరులంతా ఓడిపోవడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అయోధ్యలో అసలు బాబ్రీ మసీదే లేదని స్పష్టం చేశారు. అయోధ్యలో రామ మందిరాన్ని వ్యతిరేకిస్తున్నంతవారంతా పాకిస్థాన్‌కు వెళ్ళిపోవాలన్నారు. 
 
వసీం రిజ్వీ వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముస్లిం విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మదర్సాలు ఉగ్రవాదులను తయారు చేసే కేంద్రాలుగా మారాయని ఇటీవల రిజ్వీ కామెంట్స్ చేశారు. మదర్సా వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లకు లేఖలు కూడా రాసిన సంగతి తెలిసిందే. 
 
తాజాగా అయోధ్య రామమందిరంపై రిజ్వీ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిజ్వీ వ్యాఖ్యలు ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా వున్నాయని విమర్శలొస్తున్నాయి.