శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 30 నవంబరు 2016 (09:37 IST)

అన్న-సోదరి ప్రేమ: శారీరకంగా కలిశారు.. గర్భం దాల్చిన సోదరికి విషపు ఇంజెక్షన్ వేసి పారిపోయాడు..

మానవీయ విలువలు మంటగలిసిపోయాయి. వావివరుసలు కనుమరుగవుతున్నాయి. తాజాగా అన్న-సోదరి మధ్య చిగురించిన ప్రేమ.. సోదరి హత్యకు కారణమైంది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వె

మానవీయ విలువలు మంటగలిసిపోయాయి. వావివరుసలు కనుమరుగవుతున్నాయి. తాజాగా అన్న-సోదరి మధ్య చిగురించిన ప్రేమ.. సోదరి హత్యకు కారణమైంది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వేలూరు జిల్లా తిరువలం సమీపంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతు దామోదరన్‌, కర్పగం దంపతులకు అముద (18) కుమార్తె ఉన్నారు. కర్పగం సోదరి ఆంధ్రలోని కుప్పంలో నివాసముంటున్నారు.
 
ఈమె కుమారుడు శబరి కర్పగం ఇంట్లో ఏడాదిగా ఉంటున్నాడు. దామోదరన్‌, కర్పగంలు ప్రతిరోజు ఉదయం పొలానికి వెళ్లి రాత్రి ఇంటికి వచ్చేవారు. ఇదిలా ఉండగా శబరి, అముదాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వారి మధ్య ప్రేమ ఏర్పడిందని, శారీరకంగా కలవడంతో ఆముద గర్భం దాల్చినట్లు చెపుతున్నారు. దీంతో తనను వివాహం చేసుకోవాలని శబరిని అముద కోరగా.. అన్న వరుస కావడంతో వివాహానికి నిరాకరించాడు. 
 
అయిదే అముదా పట్టుబట్టింది. దీంతో శబరి సోమవారం తన వద్ద ఉన్న విషం ఇంజక్షన్‌ను అముదాకు హత్య చేసి పారిపోయాడు. సమాచారం అందుకున్న తిరువలం పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని అముద మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం అడుక్కంపారై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇంట్లో ఉన్న అక్క కుమారుడు శబరి కనిపించలేదని కర్పగం పోలీసులతో చెప్పింది. దీంతో పోలీసులు కరిగిరిలో బంధువుల ఇంటిలో మద్యం మత్తులో ఉన్న శబరిని అరెస్ట్ చేశారు.