శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 11 మే 2017 (09:41 IST)

భానుడి ప్రతాపంతో మూగజీవుల కష్టాలు.. కుక్కర్లో హాయిగా బజ్జున్న నాగరాజు..

ఎండలు భగ్గుమంటున్నాయి. భానుడి ప్రతాపానికి మానవులే కాదు మూగజీవులు కూడా విలవిల్లాడిపోతున్నాయి. ఇటీవల ఎండ వేడికి తట్టుకోలేని పాము ఫ్రిడ్జ్‌లో దూరిన సంగతి తెలిసిందే. సాధారణంగా పుట్టలో సేద తీరాల్సిన పాము

ఎండలు భగ్గుమంటున్నాయి. భానుడి ప్రతాపానికి మానవులే కాదు మూగజీవులు కూడా విలవిల్లాడిపోతున్నాయి. ఇటీవల ఎండ వేడికి తట్టుకోలేని పాము ఫ్రిడ్జ్‌లో దూరిన సంగతి  తెలిసిందే. సాధారణంగా పుట్టలో సేద తీరాల్సిన పాము ఇంట్లో దూరి కుక్కర్లో నిద్రపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన కైలాశ్ ఇంట్లో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. బుధవారం అన్నం వండేందుకు కుక్కర్‌ను తీసిన కైలాశ్ భార్య అందులో హాయిగా నిద్రపోతున్న పామును చూసి హడలిపోయింది. భయంతో కేకలు పెట్టింది. చుట్టుపక్కల వారిని పిలిచింది. 
 
కుక్కర్లోని పామును చడీచప్పుడు లేకుండా బయటకు తీసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో.. మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. వారు కూడా స్పందించకపోవడంతో జూ అధికారులకు చెప్పారు. వారు కూడా స్పందించకపోవడంతో చివరికి పాములు పట్టేవారిని పిలిపించారు. వీరు నాలుగు గంటల తర్వాత కుక్కర్లో వున్న పామును బయటకు తీశారు.