శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (10:26 IST)

సుష్మాజీకి సోనియా, రాహుల్ పరామర్శ: ‘‘బాగున్నారా? ఆరోగ్యం ఎలా ఉంది?’’

బీజేపీ నేత, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె తనయుడు, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు పరామర్శించారు.  

సోమవారం లోక్ సభ సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ నినాదాలతో సభ వాయిదా పడ్డాక, నేరుగా సుష్మ వద్దకు వెళ్లిన సోనియా, రాహుల్‌లు ఆమె ఆరోగ్యంపై ఆరా తీశారు. ‘‘బాగున్నారా? ఆరోగ్యం ఎలా ఉంది?’’ అంటూ సుష్మాను పలకరించారు. 
 
సుష్మా కూడా వారిద్దరితో నవ్వుతూనే మాట్లాడారు. పార్లమెంటు హౌస్‌లో ఆదివారం జరిగిన ఓ సదస్సుకు హాజరైన సందర్భంగా మెట్లపై తడబడ్డ సుష్మా కాలు బెణికింది. అయినా ఆమె యథావిధిగా తన విధులకు హాజరవుతున్నారు.