శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 10 మే 2017 (07:52 IST)

సోనియా గాంధీకి ఫుడ్ పాయింజనింగ్.. గంగారామ్ ఆస్పత్రిలో అడ్మిట్

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరోమారు స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. ఆమెకు ఫుడ్ పాయిజనింగ్‌ అయింది. దీంతో ఆమెను హుటాహుటిన ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిక

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరోమారు స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. ఆమెకు ఫుడ్ పాయిజనింగ్‌ అయింది. దీంతో ఆమెను హుటాహుటిన ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. 
 
ఈ సందర్భంగా ఆసుపత్రి  మేనేజ్ మెంట్ బోర్డు ఛైర్మన్ డాక్టర్ డీఎస్ రానా మాట్లాడుతూ, ఫుడ్ పాయిజనింగ్ కారణంగా రెండు రోజుల క్రితం ఆమె ఆసుపత్రిలో చేరారని చెప్పారు. ఆమె కోలుకున్నారని, ప్రస్తుతం సోనియా ఆరోగ్యంగానే వున్నారని చెప్పారు. సోనియాను ఆసుపత్రి నుంచి త్వరలోనే డిశ్చార్జి చేస్తామని చెప్పారు. 
 
కాగా, సోనియా గాంధీ గత కొంతకాలంగా కేన్సర్ వ్యాధికి చికిత్స చేయించుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. పైగా, ఇటీవలే అమెరికాలోని ఓ ఆస్పత్రికి  కూడా వెళ్లి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె మరోమారు స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు.