శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Srinivas
Last Modified: బుధవారం, 23 మే 2018 (21:47 IST)

85 ఏళ్లుగా తితిదేపై ప్రభుత్వ పెత్తనం.... పిటీషన్ వేస్తున్నా: సుబ్రహ్మణ్య స్వామి

జులై మొదటి వారంలో సుప్రీంకోర్టులో టిటిడి వివాదంపై పిటిషన్ దాఖలు చేయునున్నట్టు సుబ్రహ్మణ్య స్వామి తెలియజేశారు. ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులను విధుల నుంచి తొలగిస్తూ టిటిడి పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని పిటిషన్‌లో కోరనున్నట్టు తెలిపారు.

జులై మొదటి వారంలో సుప్రీంకోర్టులో టిటిడి వివాదంపై పిటిషన్ దాఖలు చేయునున్నట్టు సుబ్రహ్మణ్య స్వామి తెలియజేశారు. ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులను విధుల నుంచి తొలగిస్తూ టిటిడి పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని పిటిషన్‌లో కోరనున్నట్టు తెలిపారు. తమిళనాడు చిదంబరంలో ఉన్న నటరాజ దేవాలయానికి 2014 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో విముక్తి లభించిందని, ఏ దేవాలయం అయినా ప్రభుత్వ అజమాయిషీలో పరిమిత కాలం మేరకే ఉండవచ్చు అని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు.
 
ఆ తీర్పును ప్రాతిపదికగా తీసుకుని తిరుమల తిరుపతి దేవస్థానములపై సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రభుత్వ పెత్తనాన్ని రద్దు చేయాలని తన పిటిషన్‌లో కోరనున్నట్టు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానములపై ప్రభుత్వ పెత్తనం గత 85 ఏళ్లకు పైగా కొనసాగుతునే ఉంది. గతంలో సుప్రీం కోర్టు తీర్పునే ఉటంకిస్తూ, టిటిడి అంశాన్ని తన పిటిషన్‌లో ప్రశ్నిస్తానని తెలిపారు సుబ్రహ్మణ్య స్వామి. మరి ఈ వివాదం ఎటు మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.