సునంద పుష్కర్ హత్య మిస్టరీ: శశిథరూర్ వద్ద విచారణ.. ఏం చెప్పారు?
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సునందా పుష్కర్ హత్య కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. సునంద హత్య కేసులో కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ను ఢిల్లీ ప్రత్యేక పోలీసు బృందం మరోసారి ఆదివారం ప్రశ్నించింది. దాదాపు 5 గంటల పాటు విచారణ సాగగా, సునందను ఎవరు చంపారన్న ప్రశ్నను పలుమార్లు అడిగినట్టు తెలుస్తోంది. కాగా, శశిథరూర్ మాత్రం ఔషధాల మోతాదు ఎక్కువగా తీసుకోవడం వల్లే ఆమె మరణించిందని సమాచారం.
అంతకుమించి మరేమీ జరగలేదని శశిథరూర్ సమాధానం ఇచ్చినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా, తొలుత సునందా పుష్కర్ సహజమరణం చెందారన్న నిర్ణయానికి వచ్చిన పోలీసులు, ఆపై ఆమెది అనుమానాస్పద మృతిగా భావించి కేసు విచారణను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె సహజంగా మరణించలేదని.. తమ విచారణ మేరకు ఆమెది అసహజ మరణమేనని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ ఎస్పీ వెల్లడించారు.