శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 22 జులై 2014 (12:42 IST)

గాలి జనార్థన్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టేసిన సుప్రీం!

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్ను దేశ అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో గాలి జనార్థన్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మంగళవారం కోర్టు ముందు విచారణకు వచ్చింది. 
 
మూడేళ్లుగా దర్యాప్తు పూర్తి చేయకుండా నిందితులను ఎంత కాలం జైల్లో ఉంచుతారని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సీబీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓఎంసీ కేసులో గాలి జనార్థన్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. నిందితుల శిక్ష ఖరారు కాకుండానే దర్యాప్తు దశలో ఇలా జైల్లో ఉంచడం న్యాయ సమ్మతం కాదని వ్యాఖ్యానించింది. గాలి జనార్థన్ రెడ్డి అన్ని కేసులను ఆరు నెలల్లో పూర్తి చేయాలని సుప్రీం ఆదేశించింది.