శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 2 అక్టోబరు 2014 (11:12 IST)

స్వచ్ఛ భారత్ అభియాన్‌లో మోడీ.. వాల్మీకి సదన్‌లో..!?

మోడీ ప్రభుత్వం ప్రకటించిన ‘స్వచ్చ భారత్’ కార్యక్రమం ఈరోజు దేశవ్యాప్తంగా మొదలయింది. స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఢిల్లీలోని పారిశుద్ధ్య కార్మికులు ఉండే వాల్మీకీ సదన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మోడీ, కార్యక్రమాన్ని ప్రారంభించారు. 
 
గురువారం ఉదయం బాపూ ఘాట్ వద్ద జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించిన ప్రధాని మోడీ, నేరుగా వాల్మీకీ సదన్ చేరుకున్నారు. 
 
సదన్‌లోని పారిశుద్ధ్య కార్మికులతో కలిసి మోడీ చీపురు పట్టారు. వారితో కలిసి రోడ్డు వూడ్చి చెత్త ఎత్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ శాఖల అధికారులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.