శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 22 నవంబరు 2017 (14:42 IST)

అమ్మను అపస్మారక స్థితిలోనే ఆస్పత్రిలో చేర్చారట.. పెన్ డ్రైవ్‌లో?

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివసించిన వేద నిలయంలో ఐటీ అధికారులు సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో కీలకమైన పెన్ డ్రైవ్ లభ్యమైందని తెలుస్తోంది. వేదనిలయంలోని జయలలిత, శశికళ సహాయకుడు పూంగుండ్

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివసించిన వేద నిలయంలో ఐటీ అధికారులు సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో కీలకమైన పెన్ డ్రైవ్ లభ్యమైందని తెలుస్తోంది. వేదనిలయంలోని జయలలిత, శశికళ సహాయకుడు పూంగుండ్రం గదుల్లో ఐటీ అధికారుల తనిఖీల్లో పెన్ డ్రైవ్‌ను లభ్యమైంది. ఆ పెన్ డ్రైవ్‌లో జయలలితను ఆస్పత్రి తరలించేందుకు గంటముందు గల విజువల్స్, ఆస్పత్రిలో చికిత్స సందర్భంగా గల విజువల్స్ వున్నాయని సమాచారం.  
 
జయలలిత మరణంపై ఇప్పటికీ పలు అనుమానాలున్నాయి. తాజాగా లభించిన పెన్ డ్రైవ్ ద్వారా జయలలిత అపోలో ఆసుపత్రిలో చేరే సమయంలో అపస్మారకస్థితిలో వున్నారని గతంలో ప్రచారం జరిగిన వార్తలకు బలాన్నిచ్చేలా వున్నాయి. ఇప్పటికీ ఈ పెన్ డ్రైవ్ ఐటీ అధికారుల వద్ద వున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. 
 
కాగా.. గత శుక్రవారం రాత్రి వేదనిలయంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడి సందర్భంగా ల్యాప్‌టాప్‌, టాబ్లెట్, కంప్యూటర్, ఆరు పెన్ డ్రైవ్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 20 ఏళ్ల తర్వాత అమ్మ నివసించిన పోయెస్ గార్డెన్‌లో ఐటీ దాడులు తొలిసారి నిర్వహించారు. అంతకుముందు 1996లో డీఎంకే అధినేత ఎం కరుణానిధి సీఎం అయిన తరుణంలో వేదనిలయంలో ఇలాంటి దాడులు జరిగాయి.