ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (15:32 IST)

చెన్నైలో కుక్కపై టీ స్టాల్ యజమాని అత్యాచారం..

చెన్నైలోని నందనం ప్రాంతంలో ఆదివారం అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక టీ స్టాల్ యజమాని కుక్కను అత్యాచారం చేశాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. చెన్నై యానిమల్ ట్రస్ట్‌కు చెందిన వారు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసారు. అతను వీధి కుక్కను రేప్ చేసాడని ఆరోపించారు. 
 
పోలీసులు నిందితుడిపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ రాత్రి కుక్కతో పాటుగా ఉన్న ఆ వ్యక్తిని చూసిన స్థానికులు అతడిని హెచ్చరించినప్పటికీ, అతడు ఆ కుక్కను వదిలిపెట్టి వెళ్లలేదంటూ చెప్పారు. 
 
కాగా కుక్కపై అత్యాచారం చేసినట్లు సరైన సాక్ష్యాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. దగ్గర్లోని ఒక హాస్పిటల్‌లో అమర్చి ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, ఆ టీ స్టాల్ ఓనర్ కుక్కను తీసుకెళుతున్న దృశ్యాలు రికార్డైయ్యాయి. అయితే కుక్కపై అత్యాచారం చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. ఇదిలా ఉంటే అతడు రాత్రి వేళల్లో పలుమార్లు ఇలాగే చేస్తుండేవాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.