శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (12:38 IST)

పంతులమ్మ ప్రేమ పాఠాలు.. దిండిగల్‌లో విద్యార్థితో పరారీ!

తరగతి గదిలో విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ పంతులమ్మ.. ఓ విద్యార్థికి ప్రేమ పాఠాలు బోధించింది. ఆ తర్వాత ఆ విద్యార్థితోనే పారిపోయింది. ఈ సంఘటన తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో చోటు చేసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. 
 
దిండిగల్ సమీపంలోని ముత్తళగుపట్టికి చెందిన దేవరాజ్ కుమార్తె సెబాస్టిన్ సారధి (21) ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి.. స్థానికంగా ఉండే ఓ ట్యూటోరియల్ కాలేజీలో టీచర్‌గా పని చేస్తోంది. ఆ ట్యూటోరియల్‌లో ఇదే జిల్లాకు చెందిన ములియపాళెం విద్యార్థి సతీష్ కుమార్ (18) విద్యాభ్యాసం చేస్తున్నాడు. 
 
ఈ విద్యార్థికి, టీచరమ్మకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. దీంతో వారిద్దరు క్లాసు ముగిశాక ఏకాంతంగా ప్రేమ పాఠాలు బోధించుకునేవారు. ఈ క్రమంలో సెలవు దినాల్లో కూడా పాఠశాల ఉందని చెపుతూ విహారయాత్రలకు వెళ్లేవారు. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో వారిద్దరిని మందలించారు. 
 
దీంతో వారిద్దరు పారిపోవాలని నిర్ణయించుకుని సోమవారం రాత్రి పారిపోయారు. దీనిపై టీచరమ్మ తండ్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. విద్యాబుద్ధులు చెప్పాల్సిన పంతులమ్మ.. విద్యార్థితో లేచిపోవడం స్థానికంగా కలకలం సృష్టించింది.