శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By DV
Last Modified: శనివారం, 6 ఫిబ్రవరి 2016 (20:15 IST)

క్యాన్సర్ వ్యాధిపై అవగాహనకు గౌతమి లైఫ్ ఎగైన్ ఆర్గనైజేషన్

క్యాన్సర్ బాధితులను ఆదుకునేందుకు, క్యాన్సర్ వ్యాధిపై ప్రజలలో అవగాహన పెంచేందుకు ప్రముఖ నటి గౌతమి లైఫ్ ఎగైన్ పెరుతో ఓ సోషల్ ఆర్గనైజేషన్‌ను ప్రారంభించారు. హైమా రెడ్డి ఈ సంస్థకు కో-ఫౌండర్‌గా వ్యవహరిస్తున్నారు. చికాగోలో ఇటీవలే లైఫ్ ఎగైన్ వరల్డ్‌వైడ్ క్యాంపెన్‌ను కమల్ హాసన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నటులు జగపతి బాబు, మమతా మోహన్ దాస్.. ఉత్తర్ ప్రదేశ్ ఎంపి.గాయత్రి ప్రసాద్ ప్రజాపతి తదితరులు పాల్గొన్నారు.
  
క్యాన్సర్ వ్యాధితో ప్రతి ఏటా కోట్ల సంఖ్యలో ప్రజలు మృత్యవాత పడుతున్నారు. వారిలో కొందరినైనా కాపాడేందుకు, మరింతమందిలో క్యాన్సర్ పైన అవగాహన తెచ్చేందుకు లైఫ్ ఎగైన్ తరపున చేస్తోన్న ఈ క్యాంపెన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఈ తరహా సేవకు ముందికొచ్చిన గౌతమి మరియు హైమా రెడ్డి కృషి విజయవంతమవ్వాలని అతిథులు ఆకాంక్షించారు.