శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 28 మే 2017 (14:45 IST)

పాకిస్థానీయులకు భారత్ ఆధార్ కార్డులు.. రూ.100 చెల్లించి మరీ...

కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్న ఆధార్ కార్డులు పాకిస్థానీయులు కూడా పొందుతున్నారు. అదీకూడా భారత్‌కు వచ్చిన రూ.100 చెల్లించి ఈ కార్డులను పొందడం ఈ కార్డుల జారీలో ఉన్న డొల్లతనం మరోమారు బహిర్గతమైంది. ఈ వివ

కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్న ఆధార్ కార్డులు పాకిస్థానీయులు కూడా పొందుతున్నారు. అదీకూడా భారత్‌కు వచ్చిన రూ.100 చెల్లించి ఈ కార్డులను పొందడం ఈ కార్డుల జారీలో ఉన్న డొల్లతనం మరోమారు బహిర్గతమైంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం ఆధార్ నంబర్ల జారీ. అందరికీ విశిష్ట గుర్తింపును అందించాలన్న సదుద్దేశంతోనే 'ఆధార్' ప్రాజెక్టును చేపట్టింది. అయితే, ఈ ప్రాజెక్టు ఎంతగా దుర్వినియోగమవుతుందో తెలిపేందుకు ఇది మరో ఉదాహరణ. 
 
పాకిస్థాన్ నుంచి బెంగళూరుకు వచ్చిన ముగ్గురు యువకుల వద్ద, తాము భారత్ పౌరులమేనని చెబుతూ, ఆధార్ కార్డులు లభ్యంకాగా, దీనిపై విచారణ జరిపిన పోలీసులు అవాక్కయ్యే వాస్తవాలను వెలుగులోకి తెచ్చారు. ఓ మధ్యవర్తికి రూ.300 (ఒక్కొక్కరికీ రూ.100 చొప్పున) చెల్లించిన వీరు మూడు ఆధార్ కార్డులను పొందారని తేల్చారు. 
 
దక్షిణ బెంగళూరు పరిధిలోని బాణశంకరి ప్రాంతానికి చెందిన ఓ మధ్యవర్తికి కరాచీ నుంచి వచ్చిన పాక్ పౌరులు కిర్హోన్ గులామ్ అలీ (26), ఖాసిఫ్ షంషుద్దీన్ (30), సమీరా అబ్దుల్ రెహమాన్ (25)లు ఈ డబ్బివ్వగా, వారికి అతను ఆధార్ కార్డులను సమకూర్చాడు.
 
కాగా, కిర్హోన్ ను ఖాసిఫ్ పెళ్లి చేసుకోగా, సమీరాను కేరళకు చెందిన షిహాబ్ వివాహం చేసుకున్నాడు. ఈ నలుగురూ ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్న సంగతి తెలిసిందే. తమకు ఆధార్, ఓటర్ కార్డులను ఇచ్చేందుకు తొలుత రూ.500 డిమాండ్ చేశారని, అంత డబ్బు ఇచ్చుకోలేమని బతిమిలాడుకున్న తరువాత రూ.100కు వాటిని ఇచ్చాడని విచారణలో వీరు వెల్లడించారు.