శారదా చిట్ ఫండ్ స్కామ్లో టీఎంసీ ఎంపీ సృజయ్ బోస్ అరెస్టు!
వెస్ట్ బెంగాల్ను ఓ కుదుపు కుదిపిన శారదా చిట్ ఫండ్ స్కామ్లో మరో ఎంపీని సీబీఐ అరెస్టు చేసింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సృంజయ్ బోస్ను శుక్రవారం సీబీఐ అదుపులోకి తీసుకుంది.
ఈ కుంభకోణానికి సంబంధించి కొన్ని గంటల పాటు ఎంపీ వద్ద విచారించిన సీబీఐ అధికారులు తర్వాత అరెస్టు చేశారు. కాగా, ఈ స్కాంలో అరెస్టయిన రెండో ఎంపీ. గతంలో అదే పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ కునాల్ ఘోష్ (సస్పెండయ్యారు) అరెస్టయి ప్రస్తుతం కోల్కతా జైల్లో ఉన్న విషయం తెల్సిందే.
ఈయనకంటే ముందు తృణమూల్ పార్టీ ఉపాధ్యక్షుడు రజత్ మజుందార్ను సీబీఐ అరెస్టు చేసింది. ఆ తరువాత పలువురు వ్యక్తులను సీబీఐ అధికారులు విచారించి అదుపులోకి తీసుకున్నారు.