శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 31 జనవరి 2017 (08:46 IST)

తప్పతాగింది... కైపు తలకెక్కింది... బార్‌లో బుల్లితెర నటిపై దాడి

ఐటీ నగరం బెంగుళూరులోని ఓ బార్‌లో జరిగిన వివాదంలో బుల్లితెర నటి చిక్కుకుంది. తప్పతాగడంతో నిషా తలకెక్కింది. దీంతో నానా హంగామా చేయడమే కాకుండా, తనకు పార్టీ ఇచ్చిన ఓ ప్రముఖుడి కుమారుడిపై ఏకంగా పోలీసులకు ఫి

ఐటీ నగరం బెంగుళూరులోని ఓ బార్‌లో జరిగిన వివాదంలో బుల్లితెర నటి చిక్కుకుంది. తప్పతాగడంతో నిషా తలకెక్కింది. దీంతో నానా హంగామా చేయడమే కాకుండా, తనకు పార్టీ ఇచ్చిన ఓ ప్రముఖుడి కుమారుడిపై ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత మత్తు దిగడంతో అయ్యోబాబోయ్.. క్షమించండి అంటూ ప్రాధేయపడింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
గత ఆదివారం రాత్రి బెంగళూరు యూబీ సిటీ 17వ అంతస్తులోని స్కైబార్‌లో పలువురు యువతీయువకులు కలిసి పీకలవరకు మద్యం సేవించారు. ఆ తర్వాత వారంతా గొడవపడి పరస్పరం బూతులు తిట్టుకుంటూ పరస్పరం కొట్టుకున్నారు. మొత్తం ఏడుగురు స్నేహితుల ఈ బృందంలో బుల్లితెర నటి నిరూషా కూడా ఉన్నారు. 
 
దీంతో ఈ హంగామా శృతిమించిపోవడంతో ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడు దర్శన ఒక దశలో హద్దుమీరి బుల్లితెర నటి నిరూషాపై దాడికి ప్రయత్నించాడు. ఈ పరిణామంలో ఖంగుతిన్న ఆమె స్నే హితులతో కలిసి నేరుగా కబ్బన్ పార్క్‌ పోలీస్‌ స్టేషనకు వెళ్లి ఫిర్యాదు చేసింది. 
 
ఈ లోపు నిషా దిగిన దర్శన తప్పయింది క్షమించమంటూ లేఖరాయడంతో కథ సుఖాంతమైంది. నిరూషా కూడా దర్శన్‌పై చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకునేందుకు సమ్మతించింది. అడపాదడపా స్కైబార్‌లో ఇలాంటి ఘటనలు సంభవిస్తున్నాయని పోలీసులు వెల్లడించారు.