శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 22 జూన్ 2017 (10:40 IST)

అరెస్టు చేస్తాలేగానీ... ముందు గదికి వచ్చి నా పక్కలో పడుకో : బాధితురాలితో ఎస్ఐ

తనపై అత్యాచారం చేసినవాళ్లు మళ్లీ వేధిస్తున్నారు.. వారిని అరెస్టు చేయండి ప్లీజ్ సార్ అంటూ ఓ ఎస్ఐను ఆశ్రయించిన రేప్ బాధితురాలికి ఊహించిన ఘటన ఎదురైంది. ఈ షాక్ నుంచి తేరుకున్న ఆ బాధితురాలు... తనదైనశైలిలో

తనపై అత్యాచారం చేసినవాళ్లు మళ్లీ వేధిస్తున్నారు.. వారిని అరెస్టు చేయండి ప్లీజ్ సార్ అంటూ ఓ ఎస్ఐను ఆశ్రయించిన రేప్ బాధితురాలికి ఊహించిన ఘటన ఎదురైంది. ఈ షాక్ నుంచి తేరుకున్న ఆ బాధితురాలు... తనదైనశైలిలో కౌంటర్ ఇచ్చింది. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రామ్‌పూర్‌కి చెందిన మహిళ (37) గత ఫిబ్రవరి 12న బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో అమీర్‌ అహ్మద్‌ (55), సత్తార్‌ అహ్మద్‌ (45) అనే వ్యక్తులు ఆమెను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు. ఆమె ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో ఆమె నేరుగా మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించింది. ఆయన ఆదేశాల మేరకు పలు అభియోగాలు నమోదు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు.
 
నిందితులను అరెస్టు చేయక పోవడంతో వారు దర్జాగా తిరుగుతూ వారు ఆమెను మరింతగా వేధించడం మొదలెట్టారు. దీంతో ఆమె దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మళ్లీ ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్.ఐ. జైప్రకాశ్ సింగ్ ఆమెతో... ‘వారిని అరెస్టు చేయాలంటే ముందు నువ్వు నా కోరిక తీర్చు... నాకు ఫోన్ చేసి, నా గదికి ఒంటరిగా రా.. .నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడే వారిని అరెస్టు చేస్తాను' అంటూ ఆఫర్ ఇచ్చాడు. 
 
దీంతో అతని మాటలన్నిటినీ రికార్డు చేసిన ఆమె నేరుగా వాటిని సీడీ రూపంలో తయారు చేసి ఎస్పీకి అందజేసింది. దీంతో అతనిని విధుల నుంచి తప్పించి, దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్టు చేశారు. ఫలితంగా ఎస్ఐ తిక్కకుదిరింది.