గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 25 సెప్టెంబరు 2017 (13:35 IST)

భర్తకు దెయ్యం పట్టిందనీ... శోభనం రాత్రి నవవధువుపై తాంత్రికుడు.. మరిది అత్యాచారం

కోటి ఆశలతో కొన్ని గంటల క్రితం మెట్టినింట్లో అడుగుపెట్టిన నవ వధువు తన భర్త తమ్ముడు (మరిది) చేతిలోనే అత్యాచారనికి గురైంది. నీ భర్తకు దెయ్యం పట్టింది.. అతనితో సంభోగంలో పాల్గొంటే చనిపోతావని బెదిరించి తాంత

కోటి ఆశలతో కొన్ని గంటల క్రితం మెట్టినింట్లో అడుగుపెట్టిన నవ వధువు తన భర్త తమ్ముడు (మరిది) చేతిలోనే అత్యాచారనికి గురైంది. నీ భర్తకు దెయ్యం పట్టింది.. అతనితో సంభోగంలో పాల్గొంటే చనిపోతావని బెదిరించి తాంత్రికుడితో కలిసి మరిది ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మీరట్ సమీపంలోని లిసారీ గేట్ ప్రాంతానికి చెందిన బాధితురాలికి హార్పూర్ జిల్లాలో వస్త్ర వ్యాపారితో ఈనెల 15వ తేదీన వివాహం జరిగింది. పెళ్లి తర్వాత అంటే శోభనానికి వెళ్లే ముందు ఆమెకు స్వల్పంగా మత్తుమందు కలిపిన పానీయాన్ని తాగించారు. 
 
ఆ తర్వాత శోభనం గదిలోకి మరిది, తాంత్రికుడు వచ్చి.. నీ భర్తకు దెయ్యం పట్టిందని, అతను చనిపోకుండా చూడాలని, ఇందుకోసం అతనితో సంభోగంలో పాల్గొనకుండా మరిదితో శోభనం చేయాలని, అప్పుడే భర్త బతుకుతాడని చెప్పి... మరిదితో కలసి తాంత్రికుడు కూడా అత్యాచారం చేశాడు. 
 
మరుసటి రోజు ఉదయం తెలివిలోకి వచ్చిన ఆమె, తల్లికి విషయం తెలిపింది. ఇది జరిగిన వారం రోజుల తర్వాత ఆమె పోలీసులను ఆశ్రయించగా, మీరట్ పోలీసులు ఆ ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.