శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 29 నవంబరు 2016 (10:22 IST)

భార్య లేచిపోయిందన్న అక్కసుతో కూతుర్ని చంపి.. అత్యాచారానికి పాల్పడిన కసాయి తండ్రి

ఓ తండ్రి కసాయిగా మారిపోయాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి.. ఆమె పాలిట కిరాతకుడిగా మారిపోయాడు. కన్నబిడ్డపై కన్నేసిన ఆ మానవ మృగం... బిడ్డను హత్య చేసి.. ఆపై అత్యాచారానికి పాల్పడిన దారుణం ఒకటి వెస్ట్

ఓ తండ్రి కసాయిగా మారిపోయాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి.. ఆమె పాలిట కిరాతకుడిగా మారిపోయాడు. కన్నబిడ్డపై కన్నేసిన ఆ మానవ మృగం... బిడ్డను హత్య చేసి.. ఆపై అత్యాచారానికి పాల్పడిన దారుణం ఒకటి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని జైగాం జిల్లా జైగాం పట్టణానికి చెందిన సోమ్ బహదూర్ చెట్రీ (45) దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. ఇతని భార్య వేరే వ్యక్తితో లేచి పోయింది. దీంతో మానసిక ఆందోళనకు గురైన సోమ్ బహదూర్ మద్యం తాగిన స్థితిలో కసాయిగా మారి కత్తితో తన కూతురు ప్రతీక్ష (7), కుమారుడు ఆకాష్ (5)లపై దాడి చేశాడు. ఆ తర్వాత ప్రతీక్షపై అత్యాచారానికి ఒడిగట్టాడు. 
 
ఆపై అదే కత్తితో తన గొంతు కోసుకున్నాడు. ఈ సంఘటనలో కూతురు ప్రతీక్ష అక్కడికక్కడే మరణించగా కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర గాయాలతో పడి ఉన్న తండ్రి కొడుకులకు స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వారిద్దరూ కోలుకుంటున్నారని ఎస్పీ రబీంద్రనాథ్ చెప్పారు.