శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 23 ఆగస్టు 2016 (10:27 IST)

వివాహితను కిడ్నాప్ చేసి కొండల్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం

గుర్గావ్‌లో దారుణం జరిగింది. అర్థరాత్రి ఇంట్లో నిద్రపోతున్న 29 యేళ్ల వివాహితను ముగ్గురు కామాంధులు బలవంతంగా కిడ్నాప్ చేసి కొండల్లోకి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారం జరిపారు.

గుర్గావ్‌లో దారుణం జరిగింది. అర్థరాత్రి ఇంట్లో నిద్రపోతున్న 29 యేళ్ల వివాహితను ముగ్గురు కామాంధులు బలవంతంగా కిడ్నాప్ చేసి కొండల్లోకి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారం జరిపారు. దీనిపై బాధితురాలు ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించడం లేదు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
గుర్గావ్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని బాద్‌షాపూర్ గ్రామంలో 29 యేళ్ళ వివాహిత తన పుట్టింటికి వెళ్లింది. అక్కడ ఆమె ఇంట్లో నిద్రిస్తుండగా, రాత్రి 11.30 గంటల సమయంలో ముగ్గురు దుండగులు వచ్చి ఆమెను బలవంతంగా తమ ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని అరావళి కొండల్లోకి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారం జరిపారు. వివాహితను కిడ్నాప్ చేసి తీసుకెళ్లేటపుడు ఆమె తండ్రి సెక్యూరిటీగార్డు కావడంతో రాత్రి డ్యూటీకి వెళ్లారు. తల్లికూడా అనారోగ్యంతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఈ దారుణం జరిగింది. 
 
తండ్రి వచ్చాక అతనితోపాటు బాధితురాలు బాద్ షాపూర్ పోలీసుస్టేషనుకు వచ్చి అత్యాచార ఘటనపై ఫిర్యాదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షకు పంపించగా ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని తేలింది. ఈ కేసులో ముగ్గురు నిందితులపై ఐపీసీ సెక్షన్ 323, 365, 506, 376 డి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినా నిందితులను అరెస్టు చేయలేదు. నిందితులు పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నారు.