శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 5 జులై 2017 (16:58 IST)

రొమాన్స్‌కు నిరాకరించిందని.. కొడవలితో నరికి చంపేసిన ప్రియుడు..

రొమాన్స్‌కు నిరాకరించిందని తన ప్రియురాలిని ఓ దుండగుడు దారుణంగా హతమార్చిన ఘటన తమిళనాడులోని నెల్లైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని నెల్లై జిల్లాలోని ఓ హాస్టల్‌లో ఆనంది (38) పనిచేస్తోం

రొమాన్స్‌కు నిరాకరించిందని తన ప్రియురాలిని ఓ దుండగుడు దారుణంగా హతమార్చిన ఘటన తమిళనాడులోని నెల్లైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని నెల్లై జిల్లాలోని ఓ హాస్టల్‌లో ఆనంది (38) పనిచేస్తోంది. ఈమె దారుణంగా హత్యకు గురైంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. 
 
భర్తను కోల్పోయిన ఆనంది.. తన ఇద్దరు కుమారులతో అదే హాస్టల్‌లో బసచేసి పనిచేస్తున్నట్లు తెలిసింది. అయితే ముక్కూడల్ ప్రాంతంలోని సింగం పారైకి చెందిన సెల్లప్ప (50)తో ఆనందికి వివాహేతర సంబంధం ఉందని దర్యాప్తులో తేలింది. వీరిద్దరూ రహస్యంగా కలుసుకోవడం చేసేవారని... కానీ హాస్టల్‌కు వెళ్ళిపోయాక ఆనంది సెల్లప్పతో సంబంధాలను తెంచుకుందని తెలిసింది.
 
అయితే హాస్టల్ వద్దకు వెళ్ళిన సెల్లప్ప ఆనందిని రొమాన్స్ కోసం ఒత్తిడి చేశాడు. అయితే ఆనంది అందుకు అంగీకరించలేదు. హాస్టల్‌లో ఇవన్నీ కూడదని ఆనంది చెప్పినా సెల్లప్ప వినలేదు. దీనిపై ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన సెల్లప్ప... అక్కడే వున్న కొడవలితో ఆనందిపై దాడి చేశాడు. ఆపై అక్కడ నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆనంది.. ప్రాణాలు కోల్పోయింది. పరారిలో ఉన్న సెల్లప్పను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ దర్యాప్తులో తానే ఆనందిని హతమార్చినట్లు ఒప్పుకున్నాడు.