శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 23 సెప్టెంబరు 2015 (15:12 IST)

ఇంట్లోని కోడిని దొంగిలించిందని మహిళ తల నరికేసిన వ్యక్తి

కొంతమంది వ్యక్తులు క్షణికావేశానికి లోనవుతున్నారు. ఫలితంగా కటకటాల్లో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అస్సోం రాష్ట్రంలోని గువాహతిలో ఓ దారుణ ఘటన జరిగింది. పక్కింటి మహిళ తన ఇంట్లోని కోడిని దొంగిలించిందని ఆగ్రహించి ఆ మహిళ తన నరికేశాడు. బుధవారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
గువాహటికి సమీపంలోని సోనిత్‌పూర్‌ జిల్లాలోని బార్‌ఘులి ప్రాంతానికి చెందిన ఫాగుని కవారి (50) అనే మహిళ కుటుంబానికి, అదేప్రాంతానికి చెందిన మరో కుటుంబానికి మధ్య కోళ్ల దొంగతనం అంశంపై కొద్ది రోజులుగా తగాదాలు జరుగుతున్నాయి. ఫాగుని కుటుంబం తమ కోళ్లను దొంగిలించి విందుచేసుకుంటోందని మరో కుటుంబం ఆరోపిస్తూ వస్తోంది.
 
ఈ నేపథ్యంలో నలుగురు నిందితులు ఓ పదునైన ఆయుధంతో ఫాగుని తల నరికి, ఆమె భర్తను తీవ్రంగా గాయపరిచారు. ఫాగుని కుటుంబసభ్యులు తమని తాము రక్షించుకోవడానికి అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు నలుగురు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.