బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 21 ఆగస్టు 2018 (11:30 IST)

రెడ్‌లైట్ ఏరియా మహిళను చెప్పులతో కొట్టి.. నగ్నంగా ఊరేగించారు.. ఎందుకంటే?

ఆటవిక చర్యలకు కేరాఫ్ అడ్రస్‌గా బీహార్ రాష్ట్రం మారుతోంది. ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న కొన్ని ఘటనలే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఓ యువకుడు అనుమానాస్పదంగా రైలు పట్టాల పక్కన చనిపోయాడు.

ఆటవిక చర్యలకు కేరాఫ్ అడ్రస్‌గా బీహార్ రాష్ట్రం మారుతోంది. ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న కొన్ని ఘటనలే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఓ యువకుడు అనుమానాస్పదంగా రైలు పట్టాల పక్కన చనిపోయాడు. ఆ యువకుడి మృతికి స్థానికంగా ఉండే రెడ్‌లైట్ ఏరియాలో నివశించే ఓ మహిళ కారమణని భావించిన కొందరు... ఆ మహిళను జుట్టుపట్టుకుని ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి.. చెప్పుతో కొట్టి నగ్నంగా చేసి ఊరేగించారు. ఈ దారుణం బీహార్ రాష్ట్రంలోని భోజ్‌పూర్ జిల్లాలోని దామోదర్‌పూర్‌లో జరిగింది.
 
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దామోదర్‌పూర్‌ గ్రామానికి చెందిన విమలేశ్ షా(19) అనే యువకుడు ఆదివారం అదృశమయ్యాడు. ఆ తర్వాత సమీపంలోని రైల్వేట్రాక్ వద్ద విమలేశ్ షా మృతదేహం కనిపించింది. దీంతో ఆగ్రహించిన దామోదర్‌పూర్ గ్రామస్తులు.. రైల్వేట్రాక్ పక్కనే ఉన్న రెడ్‌లైట్ ఏరియాపై దాడి చేశారు. అక్కడున్న ఉన్న షాపులను ధ్వంసం చేసి.. వాహనాలను తగులబెట్టారు. 
 
విమలేశ్ చావుకు రెడ్‌లైట్ ఏరియాలో ఉండే ఓ మహిళ కారమణని సందేహించారు. దీంతో ఆ మహిళను ఇంట్లో నుంచి బయటకు లాగి తీవ్రంగా చితకబాదారు. నగ్నంగా ఊరేగించారు. చెప్పులతో దారుణంగా కొట్టారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.